దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టారు

Mar 28,2024 07:55

మధ్య ప్రదేశ్‌లో దారుణం

ఇండోర్‌ : దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టిన అమానుష సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. హోలి రోజున జరిగిన ఈ దాడికి సంబంధించిన దశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నలుగురు మహిళలు ఓ దళిత యువతిని ఇంటి నుంచి బయటకు లాగి వివస్త్రను చేసి కొట్టారు. యువతుల మధ్య వాగ్వాదం చివరికి ఈ దాడికి దారి తీసిందని పోలీసు సూపరిం టెండెంట్‌ సునీల్‌ మెహతా తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. స్థానికులు చిత్రీకరించిన దశ్యాలు వ్యాపించడంతో, చాలా మంది నిరసనకు ముందుకు వచ్చారు.

➡️