మత్తు లేని ఆనందంతో న్యూ ఇయర్ వేడుకలు

Dec 29,2023 11:25
jvv awareness on liquor impacts

ప్రజాశక్తి-యు కొత్తపల్లి : మద్యం మత్తు మానవ మనుగడకు ప్రమాదమని జన విజ్ఞాన వేదిక తెలిపింది.  ఉప్పాడ రింగ్ రోడ్ సెంటర్లో మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మద్యం సేవించడం వల్ల ప్రజలు నష్టపోతున్న తీరుపై వారు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. యువత మద్యానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వారు కోరారు. రానున్న నూతన సంవత్సరాన్ని మత్తు లేని ఆనందంతో స్వాగతించాలని కోరారు.

➡️