మిచౌంగ్‌తో తమిళనాడు అతలాకుతలం

విశాఖపట్ట్నం/ చెన్నై: మిచౌంగ్‌ తుఫాను ప్రభావం వల్ల ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. సోమవారం తెల్లవారుజాము నుండి చెన్నైలో కుండపోతగా వర్షాలు కురియడంతో నగరంలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి వర్షపు నీరు చేరింది.. చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాంబరం ప్రాంతంలో నీటిలో చిక్కుకొన్న 15మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ బందాలు రక్షించాయి. ముమ్మర వర్షాలతో బాసిన్‌ బ్రిడ్జ్‌, వ్యాసర్‌పాడి మధ్యలోని 14వ నెంబరు బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. పరిస్థితి బీభత్సంగా వుండడంతో మంగళవారం పబ్లిక్‌ హాలిడే ప్రకటించారు. తుపాను దెబ్బకు ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. భారీ వర్షాలకు చెన్నైలోని కనతూరు ప్రాంతంలో ఓ గోడ కూలిపోయి ఇద్దరు కూలిలు మతి చెందారు.

చెన్నైలో సముద్రాన్ని తలపిస్తున్న ఎయిర్‌పోర్ట్‌

చెన్నైలో పలుచోట్ల రోడ్లు జలదిగ్బంధనంలో చిక్కుకు న్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై విమానాశ్రయం సముద్రాన్ని తలపిస్తోంది. రన్‌వేపైకి వరదనీరు చేరింది. దీంతో ఇప్పటికే 16 విమాన సర్వీసులను నిలిపివేశారు. తుఫాను బీభత్సంతో విమానాల రాకపోకలను నిలిపివేసామని, మరికొన్ని విమానాలను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో బీభత్సం సష్టిస్తున్న వర్షాలకు సంబంధించిన దశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై, కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

➡️