అనంతలో విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

కళ్యాణదుర్గం మండలం ఓబులాపురం గ్రామంలో మృతి చెందిన రైతు మనోహర్‌

    పుట్లూరు, కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఇద్దరు రైతులు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. పొలం వద్ద పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌ షాక్‌తో మరణించారు.  యల్లనూరు మండలం గడ్డవారిపల్లి గ్రామానికి చెందిన రైతు గోపాల్‌ రెడ్డి(56) బుధవారం ఉదయం తోటల పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటార్‌కు విద్యుత్‌ వైర్లను తగిలిస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమీప రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రైతు మృతి వార్త తెలుసుకున్న శింగనమల టిడిపి అభ్యర్థి బండారి శ్రావణిశ్రీ సోదరి బండారు కిన్నెరశ్రీలు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కళ్యాణదుర్గం మండలం ఓబులాపురం గ్రామంలో జరిగిన మరో ప్రమాదంలోనూ రైతు మరణించాడు. ఓబుళాపురం గ్రామానికి చెందిన మనోహర్‌(32) మంగళవారం తన వ్యవసాయ తోటలో టమోటాకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో మోటార్‌ వద్ద ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో షాక్‌కు గురై మనోహర్‌ అక్కడికక్కడే మరణించాడు.

➡️