జార్ఖండ్ : నూతన సంవత్సరం రోజున జార్ఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. జంషెడ్పూర్లోని బిస్తుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతి వేగంతో వెళుతున్న కారు మొదట స్తంభాన్ని, ఆ తర్వాత చెట్టును ఢీట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. చెట్టును ఢీకొనడంతో కారు ముక్కలైపోయింది. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతులను హేమంత్ సింగ్, చోటూ యాదవ్, సూరజ్, మోను మహతో, ఆదిత్యపూర్ బాబాకుటి, తిట్టుగా పోలీసులు గుర్తించారు. కారులో ఎనిమిది మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ … కారు అతివేగంగా వెళ్లిందని, డీసీ నివాసం సమీపంలో అదుపుతప్పి స్తంభాన్ని, ఆపై చెట్టును ఢీకొట్టిందని అన్నారు. అనంతరం అరుపులు వినిపించాయన్నారు. కారు బాగా ఇరుక్కుపోయిందని తెలిపారు. జనం పరుగులు తీశారు కానీ అప్పటికి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. స్థానికులు పోలీసుల సహాయంతో ముగ్గురిని బయటకు తీశారు. ఈ ఘటనపై గాయపడిన రవిశంకర్ తండ్రి సునీల్ ఝా మాట్లాడుతూ … ఆదివారం రాత్రి వాళ్లంతా మీటింగ్ అయినట్లు తెలిపారు. ఉదయం స్నేహితులంతా సరదాగా బిస్తుపూర్కు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారని వివరించారు.