పాక్‌లో ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

Apr 22,2024 00:52 #Army, #killed, #Pakistan
  •  ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

ఇస్లామబాద్‌ : పశ్చిమ పాకిస్థాన్‌లో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఏడుగురు కష్టమ్స్‌ అధికారులను కాల్చి చంపారు. మూడు రోజుల కిందట ఐదుగురు కష్టమ్స్‌ అధికారులను కాల్చి చంపిన దుండగులు అదే రీతిలో ఆదివారం మరో ఇద్దరిని హత్య చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ సాయుధులు ఎవ్వరనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ రెండు ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులో ఉన్న పాకిస్థాన్‌ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌-ఆఫ్ఘన్‌ మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి.

➡️