న్యూఢిల్లీ : మద్యం పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ … ప్రధాని నరేంద్ర మోడి ఇంటి ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేడు పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ పోరాటం ఉదృతం చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో … ఢిల్లీలో శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. ప్రయాణీకులకు పలు సూచనలు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్లు, ఇందిరాగాంధీ విమానాశ్రయం వైపు వెళ్లే ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ఢిల్లీలోని ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు. అన్ని కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బంది మోహరించారు.