భువనేశ్వర్ : రానున్న జూన్ 4తో బిజు జనతాదళ్ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాగ్రెస్, బిజెడి నేతలు ఒడిశాను దోచుకున్నారని, ధనిక రాష్ట్రం, పేద ప్రజల తరహాగా మార్చారని అన్నారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కారణంగా ఒడిశాలో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రజలు మాత్రం పేదరికంలోనే ఉన్నారని అన్నారు. ఈ పాపాన్ని క్షమించరని, ప్రస్తుత పాలక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
ఒడిశాలో కాంగ్రెస్ 50 ఏళ్లు అధికారంలో ఉండగా, బిజెడి 25 ఏళ్ల పాటు అధికారంలో ఉందని అన్నారు. రాష్ట్రం భారీ నీటి వనరులు, సారవంతమైన భూమి, సమృద్ధిగా ఖనిజ వనరులు, పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉందని, అయినా ప్రజలు ఎందుకు పేదలుగా మిగిలిపోయారని ప్రశ్నించారు. ఈ పాపం ఎవరిది. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత బిజెడి నేతలు దోచుకోవడంతోనే ఇది మొదలైందని ప్రధాని అన్నారు.