న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేత తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ను బిజెపి పిల్లల ఆటవస్తువుగా మార్చిందని ధ్వజమెత్తాయి. భోపాల్లోని బెరాసియా సెగ్మెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం లోక్సభ మూడో విడత పోలింగ్ సమయంలో బిజెపి పంచాయితీ నేత వినయ్ మెహర్, తన కుమారుడితో కలిసి పోలింగ్ బూత్కు వెళ్లారు. ఓటు వేయడం గురించి ఆ బాలుడు వివరిస్తున్న 14 సెకండ్ల నిడివి కలిగిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బాలుడు, అతని తండ్రి ఇవిఎంలో బిజెపి చిహ్నంపై ఓటువేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ వీడియోపై కాంగ్రెస్ నేత కమల్నాథ్ మీడియా సలహాదారు పీయూష్ బబేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”పోలింగ్ బూత్లోకి మెబైల్ ఫోన్ను ఎలా అనుమతించారు, తండ్రితో పాటు బాలుడిని బూత్లోకి ఎందుకు అనుమతించారు ” అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ను బిజెపి పిల్లల ఆటవస్తువుగా మార్చిందని ధ్వజమెత్తారు.
ఈ వీడియోపై జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ విచారణకు ఆదేశించారు. పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ అధికారి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ వీడియోపై ఎన్నికల కమిషన్ స్పందించాల్సి వుంది.
भाजपा ने चुनाव आयोग को बच्चों का खिलवाड़ बना दिया है। भोपाल में भाजपा के जिला पंचायत सदस्य विनय मेहर ने नाबालिग बेटे से डलवाया वोट। वोट डालते वक्त का विनय मेहर ने वीडियो भी बनाया। वीडियो फेसबुक पर विनय मेहर ने किया पोस्ट।
कोई कार्रवाई होगी? pic.twitter.com/M7kSZUJtCW— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) May 9, 2024