మిచౌంగ్‌ ఎఫెక్ట్‌.. తమిళనాడుకు భారీ నష్టం

Dec 6,2023 11:38 #Tamil Nadu, #Tufan
dmk ready to fight against center govt
  • తక్షణ సాయం కోరిన సిఎం స్టాలిన్‌

చెన్నై : మిచౌంగ్‌ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై మహానగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వరద నీట మునిగాయి. తుపాను కారణంగా తమిళనాడుకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ రాశారు. రిలీఫ్‌ ఫండ్‌ కింద తక్షణమే రూ. 5,060 కోట్లను ఇవ్వాలని ప్రధాని మోడీని కోరుతూ ఆయన లేఖ రాశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఈ లేఖను ప్రధాని మోడీకి డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు అందజేయనున్నారు.

➡️