ఢిల్లీ : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకార్ ఇటీవల రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఇచ్చిన రూలింగ్పై తాజాగా ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమదే అసలైన శివసేన పార్టీ అంటూ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించడాన్ని ఆయన తప్పుబడుతున్నారు. జూన్ 2022లో పార్టీ రెండుగా విడిపోయిన తర్వాత… రెండు వర్గాలు పరస్పరం అనర్హత నోటీసులు జారీ చేసుకున్నాయి. ఈ క్రమంలో గతవారం షిండే వర్గానిదే నిజమైన శివసేనగా స్పీకర్ ప్రకటించారు.