న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ఫ్రంట్ తరపున పోటీ చేయనున్న మరో రెండు స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లోని అధికారిక పేజీలలో సిపిఎం ఒక పోస్టు చేసింది. అరాంబాగ్ (ఎస్టి) నియోజకవర్గం నుంచి విప్లవ్ కుమార్ మైత్రా, జార్గ్రామ్ (ఎస్టి) స్థానం నుంచి సోనామణి ముర్ము (తుడు) పోటీ చేయనున్నట్లు తెలిపింది.
.