ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు – జవాన్‌, మావోయిస్టు మృతి

Mar 4,2024 07:57 #died, #mavoist

ప్రజాశక్తి – చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్‌, మావోయిస్టు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కాంకేర్‌ జిల్లా చోటే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హిందూ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన జవాన్లకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో వారి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జవాన్‌ కోరేటి రమేష్‌తోపాటు ఓ మావోయిస్టు మృతి చెందినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టుకు చెందిన ఎకె 47 తుపాకీ, కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. చనిపోయిన మావోయిస్టు ఎవరన్నదీ తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

➡️