తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనానికి 21 కంపార్ట్‌మెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని యాత్రికులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.సోమవారం స్వామివారిని 67,198 మంది యాత్రికులు దర్శించుకోగా 22,452 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చిందని వివరించారు.

➡️