తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Jan 1,2024 15:02 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుమల : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఏపీ కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మునూరు జయరాం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున, తమిళనాడు మంత్రి గాంధీ, శారదా పీఠం ఉత్తరాధికారి సాత్మానంద సరస్వతి, ఏపీ లోకయుక్త న్యాయ మూర్తి లక్ష్మణ్‌ రెడ్డితో పాటు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, హీరో సుమన్  ఉన్నారు.

➡️