హైదరాబాద్: ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకుని డిశ్చార్జ్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు. ఈ మేరకు గురువారం సీఎం జగన్ హైదరాబాద్కు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్ జగన్ల భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ జగన్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.