వైసిపిలోకి పలువురు నేతలు

Mar 26,2024 22:48 #amaravati, #join ysrcp

– కండువా కప్పి ఆహ్వానించిన సిఎం జగన్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పలు పార్టీలకు చెందిన నేతలు వైసిపిలో చేరారు. వీరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడివిడిగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం చేరికల కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, టిడిపి ఏలూరు, రాజంపేట పార్లమెంటు ఇన్‌ఛార్జి గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌, గంటా నరహరి, టిడిపి వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మస్తాన్‌ యాదవ్‌, టిడిపి బిసి సెల్‌ కార్యదర్శి గోరంట్ల శ్రీనివాసరావు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ మాజీ అధ్యక్షులు గొరకపూడి చిన్నయ్య దొర, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తిన రాము, విజయవాడకు చెందిన టిడిపి మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్‌, నందెపు జగదీష్‌, కొక్కిలిగడ్డ దేవమణి, కోసూరు సుబ్రహ్మణ్యం, విశాఖపట్నంకు చెందిన జనసేన నాయకులు జివి రవిరాజు, బడ్డేటి అనురాధ తదితరులు జగన్‌ సమక్షంలో వేర్వేరుగా చేరారు.

➡️