ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందే పెన్షన్లను చంద్రబాబు నిలుపుదల చేయించారని ఐవిఆర్ కాల్స్లో వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని, భార్గవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టిడిపి నేత వర్ల రామయ్య ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఈ కేసులో విచారణకు సిఐడిని ఆదేశించింది. టిడిపి ఫిర్యాదుపై విచారించిన సిఐడి గురువారం సజ్జల భార్గవరెడ్డిపై 171 ఎఫ్, 171 జి, 505(2) రెడ్ విత్ 120బి ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.