హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ‘ఆఫ్టర్ నైన్’ పబ్పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత పబ్ కొనసాగుతోందని.. అందుకే దాడులు చేసినట్లు వెల్లడించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నఅత్యాలు చేయిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పబ్పై కేసు నమోదు చేశారు. 160 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరందరికీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు పబ్లో నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.