తెలంగాణ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … కాంగ్రెస్ పార్టీ ఎంపి టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది. ఇప్పటివరకు మొత్తం 45 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం హైదరాబాద్లోని గాంధీ భవన్ లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆశావహులు భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3 వరకు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు సినీనటుడు, నిర్మాత బండ్ల గణేశ్ శుక్రవారం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ … ”రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా. మల్లారెడ్డిని మా పార్టీలోకి వచ్చినా తీసుకోబోం” అని అన్నారు. ఇంద్రవెళ్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన అద్బుతంగా ఉందని అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మతిభ్రమించి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.