బిఆర్‌ఎస్‌ షాక్‌… కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి

హైదరాబాద్‌ : నిర్మల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విఠల్‌ రెడ్డి 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లోను బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి రామారావు పవార్‌ చేతిలో ఓడిపోయారు. రామారావు పవార్‌ 24వేల మెజార్టీతో విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️