మళ్లీ బిఆర్‌ఎస్‌దే విజయం: సీఎం కేసీఆర్‌

Dec 1,2023 16:35 #cm kcr, #speech

హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌తో పరేషాన్‌ కావొద్దని, మళ్లీ బిఆర్‌ఎస్సే విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను శుక్రవారం పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందవద్దని, రాష్ట్రాన్ని పాలించబోయేది బిఆర్‌ఎస్సే అని చెప్పినట్టు సమాచారం. ఇవాళ, రేపు ఓపిక పడితే.. 3వ తేదీ సంబురాలు చేసుకుందామని పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. 3వ తేదీ ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

➡️