Mahanandi మహానందిలో మళ్లీ చిరుత సంచారం

ప్రజాశక్తి – మహానంది :నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున గోశాల మందు చిరుత సంచరించినట్లు సిసి కెమెరాల ద్వారా ఆలయ అధికారులు గుర్తించారు. ఆలయ పరిసరాల్లో గోశాలను తక్షణమే మార్చాలని అటవీశాఖ అధికారులు సూచనలు చేశారు. చిరుత సంచారం గురించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మైకుల ద్వారా యాత్రికులను, గ్రామస్తులను అప్రమత్తం చేయాలని ఆలయ సిబ్బందికి అటవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే చిరుతను బంధించాలని గ్రామస్తులు, యాత్రికులు కోరుతున్నారు.

➡️