ప్రజాశక్తి-అమరావతి :ఏపీ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో కంప్యూటర్లు ఓపెన్ చేయించి సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంతో పాాటు మరికొన్ని జిల్లాల కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. ఏపీ బెవరేజస్ కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. ఇప్పటికే ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలోనూ సీఐడీ తనిఖీలు చేసింది. హైదరాబాద్, తాడేపల్లిలోని నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక సమాచారం సేకరించినట్లు సీఐడీ వర్గాలు వెల్లడించారు. ఇప్పటికే రికార్డులు అక్రమంగా తరలించారని వాసుదేవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.