ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనపై ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగిన సభకు మోడీ ఇండియన్ ఎయిర్ఫోర్సు హెలికాఫ్టర్లో హాజరయ్యారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు సిఇఒ ఎంకె మీనాను కలిసి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు సోమశేఖర్, జి సురేష్, శివకార్తీక్, శ్రీనివాసరావు ఉన్నారు.