విశాఖలో సిపిఎం అభ్యర్థి నామినేషన్‌ భారీ ర్యాలీ

గాజువాక (విశాఖ) : విశాఖ గాజువాక నియోజకవర్గం నుండి ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్ధి మరడాన జగ్గు నాయుడు నామినేషన్‌ భారీ ర్యాలీ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు కొత్త గాజువాక నుండి భారీ ర్యాలీ ప్రారంభమైంది. కొత్తగాజువాక నుండి పాత గాజువాక వరకు ప్రదర్శన అనంతరం సభ ఏర్పాటు చేశారు. సభానంతరం కొంతమందితో నామినేషన్‌ ప్రక్రియ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ భారీ ర్యాలీలో పార్టీ సభ్యులందరూ తమ కుటుంబాలతో ఎర్ర చొక్కాలు, ఎర్ర చీరలు ధరించి పాల్గొన్నారు. పలు కళాబృందాలు, కళాకారులు కళా ప్రదర్శనలిచ్చేందుకు సమాయత్తమయ్యారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.పుణ్యవతి, సిపిఎం నాయకులు కె.లోకనాధం, సి హెచ్‌ నరసింగరావు, ఎం వి ఎస్‌ శర్మ, సిపిఐ, కాంగ్రెస్‌, ఆప్‌ నాయకులు, కార్మిక, ప్రజాసంఘాల సభ్యులు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

➡️