ప్రజాశక్తి-ఏలూరు : ముఖ్యమంత్రి జగన్ ఏలూరు పర్యటన సందర్భంగా సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ.రవి, నగర కార్యదర్శి పి కిషోర్ లను స్థానిక సిపిఎం కార్యాలయంలో పోలీసులు నిర్బంధించారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ఏలూరు నగర శివారు ఆటోనగర్ సమీపంలో, దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో నిర్బంధ చర్యలపై సిపిఎం నేతలు ఆగ్రహించారు.