ఎన్నికల కమిషన్‌కు సిపిఎం లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గుడివాడ పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకులను హౌస్‌ అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘనే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా సిఎం గుడివాడ వచ్చి వెళ్లే వరకూ తమ అదుపులోనే ఉండాలని పోలీసులు ప్రకటించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. ఎన్నికల సమయంలో సిపిఎం నాయకులపై ప్రభుత్వం ఇటువంటి నిర్బంధ చర్యలకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఇదే విషయమై కమిషన్‌కు ఉత్తరం రాసినట్లు తెలిపారు.

➡️