ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 28,2024 21:40 #student, #Suicide

ప్రజాశక్తి-మదనపల్లి (అన్నమయ్య జిల్లా) :చెరువులోకి దూకి ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దమండెం మండలం గుడిసివారిపల్లికి చెందిన మోహన్‌రెడ్డి కుమార్తె టి.రుషిత (19) కురబల్లకోట మండలం అంగళ్లలోని బంధువులు ఇంట్లో ఉంటూ స్థానిక మిట్స్‌ కాలేజ్‌లో బి.టెక్‌ చదువుతున్నారు. శుక్రవారం కళాశాలలో ఫెస్టివల్‌కు హాజరై ఆలస్యంగా ఇంటికి రావడంతో రుషితను మందలించారు. మనస్తాపం చెందిన ఆమె శనివారం తెల్లవారుజామున అంగళ్లు- మదనపల్లి రోడ్డులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రుషిత ఆచూకీ లభించకపోవడంతో ముదివేడు పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం అంగళ్లు చెరువులో శవమై తేలిన రుషిత మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

➡️