బిజెపి, మోడీ ప్రభుత్వాన్ని సాగనంపండి

farmers bike rally against bjp govt

బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్, బైకు ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, కార్మికులు, కర్షకుల హక్కులను కాలరాస్తున్న, కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి ప్రాతూర్ క్రాస్ రోడ్డు వద్ద, బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ ని ఆయన ఏ ఐ కె ఎస్ జెండాను ఊపి, ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఒకవైపున పెట్రోల్ డీజిల్, గ్యాస్, ధరలను విపరీతంగా పెంచేసి, ప్రజల నెత్తిన భారాలు వేయడమే కాక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే దేశ సంపదను అంబానీ, అదాని వంటి కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా దోచిపెడుతుందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోడీ పరిపాలనలో కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు కల్పించిన నరేంద్ర మోడీ రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికుల హక్కులను కాల రాశారని ఆయన మండిపడ్డారు. అదా నీ అంబానీలను కుబేరులను చేసి, రైతులను వ్యవసాయ కార్మికులను అప్పులు పాలు చేశారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చారన్నారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. నిరంకుశ పరిపాలన సాగిస్తున్న కేంద్ర బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకం అవ్వాలని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు సీ టు 50 శాతం ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, కేరళ రాష్ట్ర విధానాన్ని అమలు చేయాలని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివనాగ రాణి మాట్లాడుతూ ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలీలకు 200 పని దినాలు పెంచి, వేతనం 600 రూపాయలు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ మస్టర్ విధానాన్ని రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు ఎస్ ఎస్ చెంగయ్య మాట్లాడుతూ కార్మికుల పొట్ట కొట్టే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటు కరణ నిలుపుదల చేసి, కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ కరువు తుఫాన్ నష్టపరిహారాలను ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు వెంటనే ఇవ్వాలని, రైతులందరికీ పంటల బీమా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సాగులో ఉన్న కౌలు రైతులకే, నష్టపరిహారాలు బీమా సౌకర్యం ఇవ్వాలన్నారు. అంతేకాకుండా విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించి, స్మార్ట్ మీటర్ల బిగించే విధానాన్ని నిలుపుదల చేయాలన్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, నిర్వాసితులకు పూర్తి పునరావసం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ట్రాక్టర్, బైక్ ర్యాలీలో కార్మికులు, రైతులు తమ వాహనాలకు ఏఐకేఎస్, సిఐటియు, ఏఐటీయూసీ జెండాలు కట్టుకొని, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుంచనపల్లి, ప్రాతూరు, గుండి మెడ, చిర్రావూరు, మెల్లెంపూడి, ఇప్పటం వడ్డేశ్వరం , కొలనుకొండ, తాడేపల్లి తదితర గ్రామాలలో ట్రాక్టర్, బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి శివ నాగరానీ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్ఎస్ చేంగయ్య, మహిళా సంఘం నాయకురాలు ఎన్ భారతి, రైతు సంఘం నాయకులు ముసునూరు సుహాస్, గుంటక సాంబిరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు వెంకటయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు మోదుగుల శ్రీనివాసరెడ్డి, కాజా వెంకటేశ్వరరావు, రైతు నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి,అమ్మిశెట్టి రంగారావు, డోకిపర్తి రాజేంద్ర బాబు, గోపాల్ రావు,రాజధాని రైతు సంఘం నాయకులు కొర్రపోలు ఈశ్వరరెడ్డి, ఎస్.కె ఎర్ర ఫీరు, సిఐటియు నాయకులు డి విజయభాస్కర రెడ్డి, కంప వెంకటయ్య, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఆర్ వి రాఘవయ్య, వై బర్నబాస్, టి బక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

farmers bike rally against bjp govt bapatla

బాపట్ల : వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాలను తొలగించేందుకు, రైతులను ఆదుకునేందుకు డాక్టర్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు పెట్టుబడిపై అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి రాయని వినోద్ బాబు డిమాండ్ చేశారు.

ఆహార భద్రత చట్టాన్ని పటిష్ట పరచాలి 

తూర్పు గోదావరి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి. కడప ఉక్కును నిర్మించాలి. విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలి, స్మార్ట్ మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలి.  భూహక్కుల చట్టం 22ను ఉపసంహరించాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నిర్వాసితులకు పూర్తి పునరావాసం నష్టపరిహారం ఇవ్వాలి.  కరువు, తుఫాను నష్టపరిహారాలను/ ఇన్ ఫుట్ సబ్సిడీలను వెంటనే ఇవ్వాలి. అందరికీ పంటల బీమా కల్పించాలి.  సాగులో ఉన్న కౌలు రైతులకే నష్టపరిహారాలు, బీమా సౌకర్యం ఇవ్వాలి.   అటవీ హక్కుల చట్టం సవరణలు ఉపసంహరించాలి. ఆదివాసుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏపీ.అంగన్వాడి వర్కర్స్& హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులుసి.హెచ్.మాణిక్యంబ సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కే.ఆదం కేకే. దుర్గారావు కౌలు రైతు సంఘం నాయకులు కంకటాల బుద్ధుడు రామనాథం మురళి ఏపీ రైతు సంఘం నాయకులు సుభాష్ చంద్రబోస్ జుజ్జ వరపు శ్రీను నాయకత్వం వహించారు. పడమి పల్లంరాజు కోడూరి బుల్లి అబ్బులు శ్రీరంగం రాము తేడాలేంటి గన్నియ్య పంపాని సత్యనారాయణ గుడ్ల రామదుర్గారావు పి.విజయ్ కుమారి జి.సుశీల పి.వెంకటలక్ష్మి బి.పార్వతి తదితరులు పాల్గొన్నారు.

 

farmers bike rally against bjp govt vzm

రాజ్యాంగ స్ఫూర్తితో మోడీ విధానాలపై కలిసి పోరాడుదాం 

విజయనగరం టౌన్ : రాజ్యాంగం స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక,కర్షక రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన బైక్ ర్యాలీ నీ ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు ఎం.శ్రీనివాస జెండా ఊపి ప్రారంభించారు. విజయనగరం కలెక్టరేట్ దగ్గర ప్రారంభమైన బైక్ ర్యాలీ బాలాజీ మార్కెట్, ఎన్సిఎస్, కన్యక పరమేశ్వర కోవెల, ఎంజీ రోడ్డు, కోట, బాలాజీ జంక్షన్ మీదుగా కాంప్లెక్స్ దగ్గర ముగింపు జరిగింది. ఈ సందర్భంగా ఎం శ్రీనివాస మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు నుంచి రైతులు 1,50,000 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారని నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎరువులు పురుగు మందులు సబ్సిడీ ద్వారా అందించాలని ఎమ్మెస్ స్వామినాథన్ సిఫార్సులు ప్రకారం 50% పెట్టుబడి నిధి ఇవ్వాలని ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టడం ధ్వారా తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుంది. దేశంలో ప్రభుత్వం రంగ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్, రైల్వే, ఎల్ఐసి, టెలికం వంటి సంస్థలను ప్రైవేట్ కరణ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా మోసం చేసింది.దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేని విదంగా పెరిగిందన్నారు. రాజ్యాంగం ప్రమాణం చేసి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం దానిని పక్కనపెట్టి సెక్యులరిజన్ని దెబ్బతీస్తూ మెజార్టీ పేరు మీద పెద్ద ఎత్తున మతోన్మాదాన్ని పెంచే విధంగా పరిపాలన చేస్తుందన్నారు.
ప్రజాస్వామ్యం,లౌకికవాదం, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి మాటలను గౌరవించకుండా అభ్యుదయవాదుల పైన మేధావుల పైన ఉపా చట్టం ఉపయోగించి జైల్లో పెట్టి నిర్బంధిస్తుందన్నారు.. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ బైక్ ర్యాలీలో సిఐటియు ప్రధాన కార్యదర్శికే కె.సురేష్,జిల్లాఉపాధ్యక్షులు వి. లక్ష్మి, బి.సుధారాణి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ జగన్మోహన్,బి.రమణ, నగర ఉపాధ్యక్షులు ఆర్.శంకర్ రావు,రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు,జిల్లా ఉపాధ్యక్షుడు ఆదినారాయణమూర్తి,సుజల పోరాట కమిటీ కన్వీనర్ సిహెచ్ జగన్,ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్,కౌలు రైతు సంఘం పైడుపునాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకోటి రాములు, రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేమురెడ్డి లక్ష్మి నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అమర్ భవన్ జిల్లా కార్యదర్శి డి అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం అమర్భవన్ జిల్లా కార్యదర్శ పురం అప్పారావు, రైతు నాయకులు పైడ్రాజు, బంగారు నాయుడు, నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్లు : 

  1. స్వామినాథన్‌ సిఫారసులకనుగుణంగా అన్ని పంటలకు సి2 ప్లస్‌ 50 శాతం అన్న ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధర గ్యారంటీ చేస్తూ చట్టం తేవాలి.

2.  రైతులను కారుతో తొక్కించి చంపిన ఘటనతో ప్రమేయమున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించాలని, ఆయనపై హత్య కేసు నమోదు చేయాలి.

3. సమగ్ర రుణమాఫీ చేయాలని, కార్మికులకు నెలకు రూ. 26 వేలు కనీస వేతనం ఇవ్వాలి.

4. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. ప్రాథమిక హక్కుగా ఉపాధి హామీని చేయాలి .

5. పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించాలి.

6. రైల్వే, రక్షణ, విద్యుత్‌ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ఉద్యోగాల్లో కాంట్రాక్టీకరణ రద్దు చేయాలి.

7. ఒక వ్యక్తికి రోజుకు రూ. 600 వేతనంతో ఏడాదికి 200 రోజుల పనితో ఉపాధి హామీని బలోపేతం చేయాలి

8. సంఘటిత, అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో అందరికీ పెన్షన్‌, సామాజిక భద్రత కల్పించాలి.

9. కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌)లో సెక్షన్‌ 104 రద్దు చేయాలి.

10. భూసేకరణ పరిహారం, పునరావాసం (ఎల్‌ఎఆర్‌ఆర్‌) చట్టం-2013 అమలు చేయాలి

గుంటూరులో మోటర్ సైకిల్ ర్యాలీ బ్రహ్మానందం స్టేడియం నుంచి చుట్టగుంట సెంటర్ వరకు చుట్టకొండ సెంటర్లో ముగింపు సభ

➡️