బేస్తవారపేట (ప్రకాశం) : ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద జరిగింది.పోలీసుల కథనం మేరకు …. బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) టీ తాగడానికి పందిళ్లపల్లి సమీపంలోని టోల్ప్లాజా వద్దకు బైక్పై వెళ్లారు. అదే సమయంలో గిద్దలూరు నుంచి బేస్తవారపేట వైపు వస్తున్న బొలెరో వాహనం, యువకులు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు.