మద్యం ఆదాయం జమకోసం.. ఆదివారం బ్యాంకులు తెరవండి -ఎస్‌బిఐకి ఆర్థికశాఖ లేఖ

May 8,2024 21:50 #Finance Ministry, #letter to SBI

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి :రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి. 10, 11 తేదీల్లో కనీసం రు.200 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఈ నిధులను బ్యాంకులో జమచేసేందుకు 12వ తేదీ ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తెరిచి ఉంచాలని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)కు ఆర్థికశాఖ లేఖ రాసింది. ప్రధానంగా 29 ప్రాంతాల్లోని శాఖలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలని ఆ లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న 2,934 మద్యం దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుందని, అందువల్లే 12వ తేదీన బ్యాంకులు తెరిచి ఉంచాలని ఆర్థికశాఖ కోరింది.

➡️