జనగామలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం – ఐదుగరు విద్యార్థినిలకు అస్వస్థత

జనగామ : జనగామ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. గురువారం జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు వెంటనే జనగామ మాత శిశు ఆసుపత్రికి విద్యార్థినిలను తరలించారు. గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం. అయితే రోజూలాగానే సాయంత్రం విద్యార్థినులు భోజనానికి వెళ్లారు. భోజనం చేస్తుండగా ఇంతలో … ఐదుగురు విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి రావడం మొదలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు విద్యార్థినిలకు ఫుడ్‌ పాయిజన్‌ అయినట్లు డాక్టర్లు వెల్లడించారు ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 3 గంటలు అబ్జర్వేషన్‌ లో ఉంచాలని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️