ప్రజాశక్తి – కోడుమూరు : ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసిపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామాలు చేసి.. వేరే పార్టీలలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళి కృష్ణ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన బుధవారం కాంగ్రెస్లో చేరారు. ఆయనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.