నేడు కరీంనగర్‌లో కెసిఆర్‌ పర్యటన

Apr 5,2024 07:39 #karimnagar, #KCR, #today, #Visit

కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో కెసిఆర్‌ రానున్నారు. ముందుగా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ఈరోజు మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో కెసిఆర్‌ మాట్లాడిన తరువాత ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌజ్‌కు తిరిగి ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో కెసిఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

➡️