ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు గ్రామ ప్రజలతో స్కూల్ దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలోని తాగునీరు, రహదారి, సిసి రోడ్లు, తదితర సమస్యలు గ్రామ ప్రజలు కే.ప్రేమ్ కుమార్, డి.బాలన్న, కే.నూకరాజు నాయకులకు వివరించారు. అనంతరం వారి సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్.హైమావతి మాట్లాడుతూ … ఏజెంట్ ప్రాంతంలో హక్కులు చట్టాలు కోసం పోరాటం చేసే సిపిఎం ఎంపీ అభ్యర్థి పి.అప్పలనరస ఉద్యమకారుడి గెలుపుకై కృషి చేస్తే గ్రామంలో నెలకొన్న తారురోడ్డు తాగునీరు తదితర సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఓటును అమ్ముకొని ఐదు సంవత్సరాలు భావితరాల భవిష్యత్తు కోసం నాశనం చేసుకోవద్దని ఆమె అన్నారు. బూర్జువ పార్టీలిచ్చే బీరు బిర్యానీలకు అమ్ముడుపోకూడదని విలువలను కాపాడుకోవాలని ఆమె అన్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ తమ గ్రామంలో ప్రజల సమస్య పోరాడే సిపిఎం ఎంపీ అభ్యర్థి పి.అప్పలనరస కే తమ ఓటు వేస్తామని గెలిపిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. తమ సమస్యల కోసం గెలిచిన ఏ పార్టీ నాయకులు తమ గ్రామానికి వచ్చిన దాఖలు లేదని గ్రామస్తులు అన్నారు. తమ సమస్యలపై పోరాటం చేసే సిపిఎం పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జి దేవుడు నాయుడు, గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.కఅష్ణారావు, భాష వాలంటర్ చిట్టిబాబు, నాయకులు మూర్తి, ఆనంద్, గ్రామ ప్రజలు బాలన్న, పండన్న, చరణ్, మహిళలు కాసులమ్మ, కరుణ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.