వరికపూడిశెల జలాశయానికి నిధులు కేటాయించాలి

palnadu irrigation projects farmers meet cpm leaders

సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి‌ రాఘవులు

ప్రజాశక్తి-విజయవాడ : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల జలాశయానికి నవంబర్ లో శంకుస్థాపన చేసినప్పటికీ నేటికీ ఎలాంటి నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి‌ రాఘవులు తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం రాత్రి వరికపూడిశెల జలాశయ పోరాట కమిటీ ప్రతినిధుల బృందం విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి‌ రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు లను కలిసి వారి సమస్యలను తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న పోరాటానికి సిపిఎం మద్దతును కోరారు.  వరికపూడిశెల జలాశయ పోరాట కమిటీ పోరాటానికి సిపిఎం మద్దతు తెలుపుతుందని సిపిఎం నేతలు పేర్కొన్నారు.

 

May be an image of 6 people and text that says "O జై వరికపూడిశెల! జవాన్ జ కిసాస్ జైజై పరికపూడిశెల వ్యవసాయం నిలవాలి"

➡️