ప్రజాశక్తి- రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : అన్నమయ్య జిల్లా బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలకు చెందిన రీను మహేంక్ (18) అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్లెర్నింగ్) మొదటి సంవత్సరం చదువుతుంది. గత శుక్రవారం రీను తల్లిదండ్రులు తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లి, సోమవారం కళాశాలలో విడిచిపెట్టారు. అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత రీను తన గదికి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనబడింది. కళాశాల నుంచి తిరిగి వచ్చిన తోటి విద్యార్థులు గమనించి విషయాన్ని యాజమాన్యానికి చెప్పారు. వారు పోలీసులకు, మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.