- ఇద్దరు మృతి
ప్రజాశక్తి-నందిగామ : ఎన్టిఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే చోట మూడు యాక్సిడెంట్లు జరిగాయి. హైవే పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లారీని మరోలారీ ఢీకొట్టింది. ప్రమాదస్థలానికి వెళ్లిన తండ్రీకొడుకులపైకి ఇంకో లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. వీరు ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు, రామరాజుగా గుర్తించారు. మూడు లారీల ప్రమాద స్పాట్లో కంటైనర్ డ్రైవర్ కంగారుపడి అతి వేగంగా మలుపుతిప్పడంతో మరో ప్రమాదం జరిగింది. విశాఖ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. బస్సులో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.