వైకుంఠ ద్వార దర్శనం పూర్తి : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Jan 2,2024 13:21 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుమల : డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 6,47,452 మంది యాత్రికులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారన్నారు.10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది రూ. 39.40 కోట్లు, 2022లో రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని.. 2.13 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో వెల్లడించారు. దాదాపు 1 లక్షకు పైగా భక్తులు టోకన్లు, టిక్కెట్లు పొంది దర్శనానికి రాలేదన్నారు. ఆబ్సెంటీస్‌ పూరించేందుకు టీటీడీ ఎంప్లాయిస్‌ రెఫరల్స్‌, పాలకమండలి సిఫార్సులపై 67 వేల రూ300 టిక్కెట్లు అందజేశామన్నారు. వచ్చే యేడాది వైకుంఠద్వార దర్శనానికి అబ్సెంటీస్‌ తగ్గించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

➡️