- మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారాలోకేష్
ప్రజాశక్తి-మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. మరో నెలరోజుల్లో కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు గత మూడేళ్లుగా చెల్లించాల్సిన కౌలు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తామని. రాజధాని కూలీలకు రూ.5వేల పెన్షన్ను పెండింగ్ లేకుండా ప్రతినెలా చెల్లిస్తామని హమీ ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో అసంపూర్తిగా నిలచిపోయిన భవనాలు చూస్తే బాధేస్తోందన్నారు. విశాఖలో భూ కుంభకోణాలు తప్ప ఒక్క అభివద్ధి జరగలేదని.. అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే లక్షమందికి ఉపాధి లభించేదన్నారు.
జగన్ అండ్ కో తో రాజమౌళి సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం గ్యారంటీ. 2019లో కోడికత్తి ఘటన జరిగాక బాబాయి శవం లేచింది. తాజాగా స్పెషల్ గులకరాయి సిఎంతోపాటు వెల్లంపల్లి రెండుకళ్లకు తగిలింది. జగన్ బస్సు యాత్ర సాగినంత సేపు నుదుటిపై బ్యాండేజ్ రోజురోజుకు పెద్దదైంది. యాత్ర పూర్తికాగానే గాయం ఆటోమేటిక్గా మాయమైందన్నారు. ఇటువంటి డ్రామాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీ బిడ్డనంటూ పదేపదే అంటున్న జగన్ ప్రజల భూములు కొట్టేసేందుకు నయా ప్లాన్ వేశారు. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారట. ఆయన ఆస్తులు ఇచ్చినట్లు పత్రాలపై ఫోటో వేసుకుంటున్నాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా విలువైన ఆస్తులు లాగేస్తారు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.