వైసిపి ఎల్‌ఇడి ప్రచార రథాలు ప్రారంభం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు రూపొందించిన ఎల్‌ఇడి ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయం ముందు జెండా ఊపి ప్రచార రథాలను గురువారం ప్రారంభించారు. పెద్ద ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటుచేసిన ఈ వాహనాలు అన్ని నియోజకవర్గాల్లోని ముఖ్యమైన కూడళ్లలో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రీవెన్స్‌సెల్‌ కమిటీ కార్యదర్శి నారాయణ మూర్తి, నాయకులు సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సిఎం జగన్‌పై జరిగిన రాయి దాడిలో బొండా ఉమా పాత్ర కనిపిస్తోందని విమర్శించారు.

➡️