ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంట నే ఆమోదించా లని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. తన పదవీకాలం 2027 మార్చి వరకు ఉందని, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని శుక్రవారం లేఖలో పేర్కొన్నారు. రాజీనామా పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఇక్బాల్ 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి దీపికను వైసిపి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన టిడిపిలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.