ఎన్నికలలో ఇండియా ఫోరమ్లో గెలిస్తే అమలు చేసే ఆరు హామీలను కేజ్రీవాల్ తరపున ఆయన భార్య సునీత ఈ సభలో ప్రకటించారు. పేదలకు నిరాటంకంగా ఉచిత విద్యుత్, ప్రతి గ్రామంలోనూ అత్యున్నత స్థాయి ప్రభుత్వ పాఠశాలలు, నైబర్హుడ్ క్లీనిక్లు, మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు, స్వామినాధన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాను ఇడి కస్టడీలో ఉన్నందున ఫోరమ్లోని మిగిలిన పార్టీల నేతలతో సంప్రదించడానికి వీలు లేకుండా పోయిందన్నారు.