క్రెసండ సొల్యూషన్స్‌ రెవెన్యూ 38శాతం వృద్థి

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో క్రెసండ సొల్యూషన్స్‌ రెవెన్యూ 38 శాతం పెరిగి రూ.19.49 కోట్లుగా నమోదయ్యినట్లు తెలిపింది. ఐటి, డిజిటల్‌ మీడియా ఆధారిత సేవలను అందించే తమ సంస్థ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.14.13 కోట్ల రెవెన్యూ ఆర్జించినట్లు పేర్కొంది. గడిచిన క్యూ2లో కంపెనీ నికర లాభాలు బహుళ రెట్లు పెరిగి రూ.5.1 కోట్లుగా నమోదయ్యిందని.. ఇంతక్రితం త్రైమాసికంలో రూ.12 లక్షల లాభాలను నమోదు చేసినట్లు పేర్కొంది. 2022-23లో మొత్తంగా రూ.6.08 కోట్ల లాభాలను సాధించినట్లు గుర్తు చేసింది.

➡️