ముంబయి : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు తన బిఎండబ్ల్యు ఐ5 ఎం60 ఎలక్ట్రిక్ సెడాన్ను ఆవిష్కరించింది. తొలిసారి 5 సీరిస్లో విద్యుత్ కారును విడుదల చేసినట్లు సోమవారం తెలిపింది. దీని ఎక్స్షోరూం ధరను రూ.1.20 కోట్లుగా నిర్ణయించింది. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 516 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపింది. 3.8 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోగలదని వెల్లడించింది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని తెలిపింది.