గూడూరులోని తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ (తిరుపతి) : మిచౌంగ్‌ తుఫాను వలన గూడూరు మండల పరిధిలోనీ గ్రామాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం గూడూరు పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వంద వాసి నాగరాజు మాట్లాడుతూ … రైతులు, కౌలు రైతులు వేసిన వరి నారు ఇటీవల వచ్చిన తుఫాను వలన కొట్టుకుపోయిందని తెలిపారు. పొలాల్లో వరద వలన ఇసుక వచ్చి చేరిందన్నారు. ప్రతి రైతు సుమారు రూ.10 వేలు నుండి 25 వేల రూపాయలు వరకు నష్టపోయారని చెప్పారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు ఉచితంగా వరి విత్తనాలు ఇచ్చి నష్ట పరిహారాన్ని చెల్లించాలన్నారు. అనంతరం సిపిఎం సెంట్రల్‌ శాఖా కార్యదర్శి జోగి శివకుమార్‌ మాట్లడుతూ … ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తరువాత సబ్‌ కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.వి.రమణయ్య, సురేష్‌, బి.చంద్రయ్య, ఆడపాల ప్రసాద్‌, పామంజీ మణి, గుర్రం రమణయ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రమిక్‌ నగర్‌ లో నివసిస్తున్న 24 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం అందలేదని ఇకనైనా అధికారులు స్పందించి బాధితులకు సహాయం అందించాలని. శ్రామిక నగర్‌ వాసులతో కలిసి సిపిఎం నాయకులు ఆర్డీవో కిరణ్‌ కుమార్‌ కి వినతిపత్రం అందజేశారు.

➡️