జగనన్న కాలనీలో 5 పూరిళ్లు దగ్ధం

May 7,2024 14:15 #5, #houses burnt, #Jagananna Colony

కారంచేడు (బాపట్ల) : కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని జగనన్న కాలనీలో మంగళవారం ప్రమాదవశాత్తు 5 పూరిళ్లు దగ్దమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇల్లు తగలబడటంతో పూర్తిగా ఇంట్లో ఉన్న వస్తువులు బంగారం, నగదు, వంట సామాను, బ్యాంకు, రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు, చేపలు పట్టే వలలు అన్నీ తగలబడిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. సంఘటన జరిగిన వెంటనే చీరాల ఫైర్‌ ఆఫీస్‌ అధికారులు చేరుకొని మంటలను అదుపు చేశారు.

➡️