అర్ధరాత్రి గాలివాన బీభత్సం.. 73 ఎకరాలలో అరటి పంట నష్టం

May 8,2024 17:52 #Annamayya district, #crops lost

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : రైల్వేకోడూరు నియోజకవర్గంలో గత రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించడంతో దాదాపు 73 ఎకరాలలో అరటి పంట నష్టం జరిగిందని ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడూరు మండలంలోని ఎస్‌ ఉప్పరపల్లె, చియ్యవరం గ్రామాలలో 20 ఎకరాలలో, ఓబులవారిపల్లె మండలంలోని వై.కోట గాదెల గ్రామాలలో, పుల్లంపేట మండలంలోని అప్ప రాజుపేట గ్రామానికి చెందిన రైతుల అరటి తోటలు దెబ్బతిన్నాయని, ఈ మేరకు పంట నష్టానికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టానికి గురవుతున్నామని ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️