ప్రజాశక్తి-చీరాల: న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం వారికి అన్నివేళలా అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో ఉన్న బార్ అసోసియే షన్ సమావేశపు హాలులో బార్ అసోసియేషన్ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎం చలపతిరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్, పలువురు సభ్యులు ఆమంచికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ మద్దతు తెలియజేసి తన గెలుపునకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇండియా కూటమి నాయకులు ఎన్నికల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోనూ, ఈపూరిపాలెంలో ప్రచార రథంతో ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలు అమలు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. టిడిపి, వైసిపి రెండు పార్టీలు మతోన్మాద బిజెపి మోడీ భజన చేస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసే లేకుండా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. జరగనున్న ఎన్నికలలో టిడిపి కూటమి, వైసీపీలకు ప్రజలు బుద్ధి చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్కు, ఎంపీ అభ్యర్థి జెడి శీలంకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్ బాబురావు, పి కొండయ్య, సిపిఎం నాయకులు శామ్యూల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిపాటి బాబురావు, దార్ల శాస్త్రి, పలువురు నాయకులు పాల్గొన్నారు.